Sunday, May 5, 2024
- Advertisement -

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రోసారి ‘నాన్నకు ప్రేమతో’ కాంబినేష‌న్‌

- Advertisement -

త‌న త‌ర్వాతి సినిమా కోసం యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించే సినిమాలో యంగ్‌గా క‌నిపించ‌డానికి ఎన్టీఆర్ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్టు ప‌నులతో త్రివిక్ర‌మ్‌, క‌స‌ర‌త్తుల‌తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఈ స‌మ‌యంలో ఈ సినిమా కోసం న‌టీన‌టుల ఎంపిక కూడా చేస్తున్నారు.

ఈ సినిమాలో విలన్‌గా జగపతిబాబును తీసుకోనున్నార‌ని స‌మాచారం. గ‌తంలో ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ న‌టించ‌నున్నారు. లెజెండ్ సినిమాతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ జగపతిబాబు ఆ త‌ర్వాత అలాంటి పాత్ర‌లు వ‌రుస‌గా చేస్తూ మంచి విజ‌యాలు అందుకుంటున్నారు. ఇప్పుడు మ‌రోసారి అదే పాత్ర‌, క్రేజీ కాంబినేష‌న్ సినిమా కావ‌డంతో ఇక జ‌గ్గుభాయ్‌ను మ‌రోసారి ఎన్టీఆర్‌తో చూడ‌వ‌చ్చు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఈ సినిమాను మార్చి నెలాఖ‌రులోగా ప్రారంభించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -