Saturday, May 4, 2024
- Advertisement -

నానీ కృష్ణార్జునయుద్ధంకి మొదటి దెబ్బ పడింది…… అంతా ట్రైలర్ మహిమ

- Advertisement -

వరసుగా యావరేజ్ కంటెంట్ ఉన్న రొటీన్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు నానీ. అయితే ఆయా సినిమాల్లో నానీ పండించిన కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌కి కూడా ఆడియెన్స్ కనెక్ట్ అవుతూ ఉండడంతో వరుసగా చెప్పుకోదగ్గ విజయాలే సాధించాడు. అయితే ఈ సారి మాత్రం ఆ మేజిక్ సాధ్యపడకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

తాజా కృష్ణార్జున యుద్ధం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్‌లో ఎక్కడా కూడా కొత్తదనం లేదు. అసలు మాస్ నానీ క్యారెక్టర్ అయితే ఇప్పటికే ఎన్నోసార్లు చూసినట్టుగా ఉంది. ఇక రాక్ స్టార్ నానీ కూడా మెప్పించింది ఏమీ లేదు. అన్నింటికీ మించి జెండా పై కపిరాజు ఛాయలు కనిపిస్తున్నాయి. పాతబస్తీలో అమ్మాయిల ట్రాఫికింగ్ ఇష్యూని రాక్ స్టార్ నానీ, మాస్ నానీ ఎలా సాల్వ్ చేశారనేది ఈ కథ. అయితే కనీసం ట్రైలర్‌తో కూడా పూర్తిగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయారు హీరో నానీ, డైరెక్టర్ మేర్లపాక గాంధీలు. రీసెంట్‌గా ఈ సినిమా రష్‌ని ప్రత్యేకంగా దిల్ రాజు చూశాడట. అయితే సినిమా విషయంలో డిసప్పాయింటింగ్ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడట. వరసగా రొటీన్ సినిమాలు చేసినప్పటికీ కాసిన్ని ఎమోషనల్ సీన్స్……..కామెడీ సీన్స్‌తో నెట్టుకొచ్చాడు నానీ. కానీ ఈ సినిమాలో కామెడీ చాలా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇక నానీ డబుల్ రోల్ చేసినప్పటికీ ఏ క్యారెక్టర్‌లోనూ పూర్తి కొత్తదనం లేకపోవడం సినిమాకు మైనస్ అవ్వనుందని తెలుస్తోంది. అదృష్టం కొద్దీ యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా సక్సెస్ అనిపించుకున్న నానీ ఈ సారి కృష్ణార్జునయుద్ధంతో ఆ ఫీట్ ఏ మేరకు సాధిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -