కొత్త తరహా కథలతో హీరోగా నటిస్తూనే ఇతర హీరోలతో స్నేహితుడిగా.. శత్రువుగా పలు పాత్రల్లో నటిస్తున్న నటుడు శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా ‘నీదీనాదీ ఒకే కథ’. ఈ సినిమా ప్రజలందరి కథ అని హీరో శ్రీవిష్ణు, దర్శకుడు ఉడుగుల వేణు చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీవిష్ణు స్నేహితుడు, నటుడు నారా రోహిత్, యువ నటుడు శర్వానంద్ హాజరయ్యారు.
ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా గురించి చెప్పడంతో శర్వానంద్కు ఎంతో నచ్చేసింది. ఇక సినిమా కూడా నచ్చేసింది.. శ్రీవిష్ణు నటనకు ఫిదా అయ్యి ఈ సినిమాను తాను కొనాలని శర్వానంద్ నిర్ణయించుకున్నాడట. వెంటనే ఈ విషయమై నిర్మాతలను శర్వా అడిగాడు. అయితే వాళ్లు సారీ శర్వా ఈ సినిమా అన్ని ఏరియాలను విక్రయించేశాం అని సమాధానం ఇచ్చారు. దీంతో శర్వా నిరాశకు గురయ్యాడు. కానీ శ్రీవిష్ణు నటన, సినిమా రూపొందించిన విధానం, కథ నచ్చడంతో శర్వానంద్ ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.