కొంత మంది నటీనటులు చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అలా మొదటి సినిమాతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి సియా గౌతమ్. పూరి జగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన నేనింతే మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది సియా.
ఆ మూవీలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఆ మూవీ హిట్ అయితే అయింది. కానీ సియాకు మాత్రం మంచి అవకాశాలు రాలేదు. 2008లో తన యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన సియా గౌతమ్ తెలుగులో నేనింతే తో పాటు వేదం సినిమాలో కూడా నటించింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సంజు మూవీ లో కూడా నటించింది.
చాలా కాలంగా ఆమె పెద్దగా కనిపించ లేదు. అసలు ఇప్పుడు ఎలా ఉందో తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అసలు పేరు అతిథి గౌతమ్. ఆమెకి ఒక అన్నయ్య ఉన్నారు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన డైలీ ఆక్టివిటీస్ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో కూడా షేర్ చేసుకుంటోంది సియా.
సుధీర్, రష్మీకి ఏం తక్కువ కాదు అంటున్న ఆది వర్షిణి..!
భార్యతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు..!