Monday, May 6, 2024
- Advertisement -

ఏనుగుపై కుర్చున్న బెల్లంకొండ.. రెచ్చిపోయిన నెటిజ‌న్లు

- Advertisement -

హీరో బెల్ల‌కొండ శ్రీనివాస్ నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురైయ్యారు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లింది సినిమా యూనిట్‌.అయితే అక్కడ బెల్లంకొండ ఓ ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటోకి ఫోజు ఇవ్వ‌డమే కాకుండా,ఆ ఫోటోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.అంతే నెటిజ‌న్లు బెల్ల‌కొండ‌పై రెచ్చిపోయారు.

బెల్లంకొండ చేసిన పనికి ముఖ్యంగా ఏనుగు దంతాలపై కూర్చొని ఫోటో తీసుకోవడాన్ని జంతు ప్రేమికులు వ్యతిరేకిస్తున్నారు. ఇది గ్రహించిన బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే తన ఖాతా నుండి ఫోటోని తొలగించారు. కాని ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఇక బెల్లంకొండ విష‌యానికి వ‌స్తే అత‌ని కెరీర్ ఏం బాలేద‌ని చెప్పాలి.ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సాక్ష్యం సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది.ప్రస్తుతం తేజ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు బెల్లంకొండ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -