Monday, May 20, 2024
- Advertisement -

రష్మిక ని ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్

- Advertisement -

రష్మిక మందన్న శెట్టి నటించిన గీత గోవిందం తెలుగు లో పెద్ద హిట్ అవ్వడం తో, హీరోయిన్ గా ఆమె స్థాయి అమాంతం పెరిగి పోయింది. ఇప్పుడు రష్మిక తెలుగు సినిమా పరిశ్రమ లో స్టార్ డం తో దూసుకుపోతున్న నటి. చేసిన సినిమాలు తక్కువే కానీ అనూహ్యం గా వచ్చిన విజయం రష్మిక ని విజయ పథం లో ఉంచింది. రష్మిక కూడా ఈ రకమైన రెస్పాన్స్ తనకి వస్తుంది అని ఎప్పుడూ అనుకోలేదు. అయితే ఆసక్తికరం గా ఆమె మరొకసారి విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ అనే సినిమా లో నటించింది.

ఈ సినిమా ట్రైలర్ నిన్న రావడం, నెటిజన్ల నుంచి పాజిటివ్ టాక్ రావడం కూడా జరిగిపోయింది. ఈ సినిమా లో కూడా విజయ్-రష్మిక ల కెమిస్ట్రీ బాగా ఉండనుంది. అయితే విచిత్రం ఏంటి అంటే రష్మిక ని కొంత మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

విజయ్ దేవరకొండ ఫాన్స్ ట్రోల్ చేస్తున్నారా లేక రష్మిక కన్నడ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు చేస్తున్నారా తెలియదు కానీ మొత్తానికి ట్రోల్ చేసే వారు మాత్రం రష్మిక విజయ్ పక్కన నటించడం చూడలేకపోతున్నారు అని చెప్తున్నారు. సోషల్ మీడియా లో అంతా వీటికి సంబందించిన మీమ్స్ ప్రస్తుతం తిరుగుతున్నాయి.

కానీ రష్మిక మళ్ళీ తన పర్ఫార్మెన్స్ తో వీళ్ళందరికీ సమాధానం ఇస్తుంది అని రష్మిక అభిమానులు ఓపిక తో ఎదురు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -