Monday, May 13, 2024
- Advertisement -

రెజీనా వద్దు, ’ఇస్మార్ట’ భామే ముద్దు అంటున్న మెగా హీరో

- Advertisement -

సవ్యసాచి సినిమా తో తెలుగు సినిమా లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ ఆ తర్వాత వెంటనే మరో అక్కినేని హీరో అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమా లో హీరోయిన్ పాత్ర చేసే అవకాశం సాధించింది. అయితే ఈ రెండు సినిమాలు నిధి కెరీర్ కి ఏ మాత్రం ఉపయోగపడలేకపోయాయి అనేది వాస్తవం. గ్లామర్ పరం గా ఏ వంక చెప్పలేము కానీ నటన విషయం లో మాత్రం నిధి పెద్దగా మెప్పించింది ఏమి లేదు. సవ్యసాచి లో హీరోయిన్ పాత్ర కి పెద్దగా ప్రాముఖ్యత లేదు కానీ మిస్టర్ మజ్ను లో పాత్ర ని అవకాశం గా తీసుకొని మంచి నటన తో అందరినీ మెప్పించే ప్రయత్నం నిధి చేయలేదు. కాకపోతే ఈ అమ్మడు ఎప్పటికి అప్పుడు ఇంస్టాగ్రామ్ లో కొత్త కొత్త హాట్ ఫోటోలు పెడుతూ కుర్రకారు మతి పోగొడుతూ ఉంటుంది కనుక ఇప్పటికీ ఆమె కి కొంత డిమాండ్ ఉంది.

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న నిధి త్వరలో సాయి ధరమ్ తేజ్ సరసన ఒక సినిమా లో నటించే అవకాశం ఉంది. మారుతి దర్శకత్వం లో సాయి ధరమ్ చేయనున్న ఈ సినిమా లో ముందుగా రెజీనా పేరు విన్పించింది కానీ ఇప్పుడు ఈ సినిమా లో నిధి హీరోయిన్ గా ఉండబోతుంది అనే వార్తలు విన్పిస్తున్నాయి.

ఈ సినిమా కి భోగి అనే టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెలువడ అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -