Wednesday, April 24, 2024
- Advertisement -

నితిన్ ఫుల్ హ్యాపీ.. కొత్త మూవీ షూటింగ్ మొదలవకముందే లాభాల్లోకి..!

- Advertisement -

రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. భీష్మ సినిమా విజయం తరువాత నితిన్ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. రంగ్ దే, చెక్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి. ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రో సినిమాతో పాటు నూతన దర్శకుడు శేఖర్ తో ఓ సినిమా, వక్కంతం వంశీతో మరో సినిమా చేస్తున్నాడు. వక్కంతం సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాకముందే బిజినెస్ కూడా పూర్తి చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అయిన శాటిలైట్, హిందీ డబ్బింగ్, డిజిటల్ ఆలిండియా రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ కొనుగోలు చేసింది. టోటల్ నాన్ థియేట్రికల్ హక్కుల కింద రూ.21 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రైట్స్ మాత్రం నిర్మాతల దగ్గరే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కుల కింద రూ.21కోట్లు రాగా, థియేట్రికల్ బిజినెస్ ఎంత లేదన్నా రూ.30 కోట్లలో పూర్తి చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను కేవలం రూ.30 కోట్లతో పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ లెక్కన ఈ సినిమా విడుదలకు ముందే లాభాల్లోకి వెళ్ళింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె తెలుగు,తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టంగా మారింది. దీంతో కొంత ఆలస్యంగా అయినా సరే హీరోయిన్ గా ఆమెని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఇటీవల పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి. ఆ సెంటిమెంట్ తోనే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న మ్యాస్ట్రో సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ హిట్ మూవీ అంధాదూన్ కు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ గుడ్డివాడిగా నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -