నభా నటేష్ కన్నడ చిత్ర సీమ ద్వారా 2015 లో వజ్రకాయ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా నభానటేష్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పరాజయం అయినప్పటికీ 2019 లో విడుదలైన పూరి జగన్నాథ్ -రామ్ ఇస్మార్ట్ శంకర్ నభా నటేష్ కు తొలి విజయం దక్కింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన సోలో బ్రతుకే సో బెటర్ కూడా మంచి పేరు తెచ్చుకుంది.
అయితే ఆ తర్వాత నభా నటేష్ నటించిన డిస్కో రాజా, అల్లుడు అదుర్స్ వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో నభా నటేష్ మరో హిట్ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం నభా నటేష్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ట్రో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన అంధాదూన్ కు రీమేక్.
Also Read: ఈ భామ జోరు చూస్తే ..పూజా హెగ్డే, రష్మికకు ఎసరు పెట్టేలా ఉందే..!
ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా నితిన్ హోమ్ బ్యానర్ మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అతి త్వరలోనే విడుదల కానుంది. కాగా ఈ సినిమా హిట్ కోసం నభానటేష్ ఎదురుచూస్తోంది. కొన్ని రోజులుగా సరైన హిట్ లేక పోవడంతో నభా నటేష్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. మరి మ్యాస్ట్రో నభా నటేష్ కు ఎటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాలి.
Also Read: పాపం సిద్ధార్థ్.. హీరోల వయసు టాపిక్ వస్తే చాలు.. వెళ్ళనీ అతడి వైపే..!