Monday, May 6, 2024
- Advertisement -

రూమర్లకు నితిన్ చెక్.. అదిరిపోయే అప్ డేట్..?

- Advertisement -

టాలీవుడ్ లో వెరైటీ చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ఐతే సినిమా తో తొలి సినిమా తోనే వెరైటీ కాన్సెప్ట్ అందించిన ఈ దర్శకుడు గోపీచంద్ సాహసం సినిమా తో కమర్షియల్ దర్శకుడిగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.. ఆ తర్వాత మనమంతా సినిమా చేసి కుటుంబ కథ దర్శకుడిగా మారిపోయారు.. ఇక ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసి ఆ సినిమా పనుల్లో ఉండగా నితిన్ వరుస సినిమాల్లో బిజీ గా ఉండడంతో ఈ సినిమా ఉందా లేదా అన్న డైలమా ఒకదశలో ఉంది..

ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అయన డిసైడ్ అయ్యారట.. ఇక నితిన్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా గురించి అందరికి తెలిసిందే..

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘అంధాధూన్’ రీమేక్ లో నటిస్తున్నారు..  సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నా ఈ సినిమా కి ఒప్పుకుందని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఉంటుందట.. ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్ ఈ సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు. గురువారం సాయంత్రం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నట్లు చెప్పినట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. నితిన్ కూడా దీని గురించి ట్వీట్ చేశాడు. ఈ అప్‌డేట్ నితిన్ ఫ్యాన్స్ కంటే యేలేటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసే ఓ వర్గం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -