టాలీవుడ్లో ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఏదంటే అక్కినేని నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమానే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఉగాది నుంచి ప్రారంభమైంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరగుతోంది.
అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్లో భాగంగా మియాపూర్ మెట్రో రైల్ స్టేషన్లో సినిమా షూటింగ్ జరింగింది. రైలులో కొన్ని సీన్స్ చేశారు. నాని హీరోయిన్ రశ్మిక మందన్నలతో పాటు నటుడు సంపూర్ణేశ్బాబుపై కొన్ని సన్నివేశాలను రూపొందించారు. దీంతో ఈ షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. తర్వాత షూటింగ్ ఎక్కడ అనేది ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా షూట్ పూర్తి చేసి దసరాలోపు విడుదల చేయాలని ప్లాన్. అందుకనుగుణంగా సినిమా షెడ్యూల్ చేస్తున్నారు.