Sunday, May 19, 2024
- Advertisement -

కమర్షియల్ సినిమాలకి కాలం చెల్లింది – క్రిష్

- Advertisement -

దీపావళి కి లెక్కలు వేసుకుని దసరా బరిలో అనూహ్యంగా దిగిన క్రిష్ సినిమా కంచె మరొక వారం లో విడుదల కి సిద్దం అవుతోంది. ఈ సినిమా ని కూడా తన స్టైల్ లో తీసారట క్రిష్. గమ్యం , వేదం , కృష్ణం వందే జగద్గురుం అంటూ వివిధ రకాల సినిమాలతో ప్రేక్షకుల స్థాయిని పెంచిన క్రిష్ ఈ కొత్త సినిమా లో రెండవ ప్రపంచ యుద్ద నేపధ్యం లో సాగుతుంది అని చెబుతున్నారు.

ఈ సినిమా కి కథ ప్రధాన ఆకర్షణ అని కథ ఈ సినిమా కి సూపర్ స్టార్ అని తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెబుతున్నారు క్రిష్ “ఈ సినిమాలో ‘ప్రేమ యుద్ధంలోనూ ఉంటుంది. ఎక్కడైనా ప్రేమ యుద్ధంలానే ఉంటుంది’ అని ఒక డైలాగ్ ఉంది.

ఈ సినిమాలో ప్రధానంగా ఈ అంశాన్ని చెబుతున్నా. అదేవిధంగా ఈ అంశం చుట్టూనే చాలారకాలైన భావేద్వేగాలున్నాయి. అవన్నీ కథతో పాటు సమాంతరంగా నడిచే విషయాలుగా చెప్పుకోవచ్చు” అంటున్నారు ఈయన. 

వరుణ్ తేజ్ తప్ప ఈ కథకి మరెవరూ సెట్ అవ్వరు అని క్రిష్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు, కమర్షియల్ చిత్రాలకి కాలం చెల్లింది అని రాబోయే సినిమాలు అన్నీ కంటెంట్ బేస్ మీదనే నడుస్తాయి అంటున్నారు క్రిష్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -