Sunday, May 19, 2024
- Advertisement -

బాల‌య్య‌ను మ‌ళ్లీ కెలికిన‌ వ‌ర్మ‌…

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాలని తలపెట్టిన లక్ష్మీస్ పార్వతి తెరమరుగైందనే అందరూ అనుకుంటున్నారు. ఈ తరుణంలో రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఆయన గతంలో ప్రకటించారు.

త‌ర్వాత కొన్నాల్లుగా సైలెంట్‌గా ఉన్న వ‌ర్మ సైలెంట్ అయ్యారు. తుఫాన్ ముందు వ‌చ్చే ప్ర‌శాంత‌త అని తెలియ‌దు. ఇప్పుడు కావాల్సినంత పెంట చేసేసాడు ఈ ద‌ర్శ‌కుడు. కావాల‌నే బాల‌య్య‌ను గిల్లుతున్నాడేమో అనిపిస్తుంది చూస్తుంటే.లేకపోతే ఇన్నాళ్లూ కామ్‌గా ఉండి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ గురించి నోరు విప్పడం ఏంటో..?

ముంబైకి చెందిన ఎంటర్ ప్రెన్యూర్ బాలగిరికి చెందిన జీవీ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాకేష్ రెడ్డి నిర్మాణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తామని, ఈ విజయదశమికి సినిమా స్టార్ట్ చేసి జనవరి చివరికల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని ఆర్జీవి తెలిపాడు. అక్టోబర్ 19న పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్, లక్ష్మిపార్వతి, చంద్రబాబు నాయుడు లతో కూడిన పాత పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ బ‌యోపిక్ గురించి సంచ‌ల‌న క‌మెంట్స్ చేసాడు వ‌ర్మ‌. క్రిష్ చేస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ల‌క్ష్మీపార్వ‌తి రాక‌తో ముగిసిపోతుంద‌ని.. కానీ త‌న “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” ఆమె రాక‌తోనే మొద‌ల‌వుతుంద‌ని చెప్పాడు. అంతేకాదు.. ద‌స‌రా రోజు తిరుప‌తిలో షూటింగ్ మొద‌లు పెట్టి.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తాన‌ని చెప్పాడు. అంటే “ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు” విడుద‌ల‌వుతున్న రోజే త‌న “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్” విడుద‌ల చేస్తాన‌ని చెబుతున్నాడు వ‌ర్మ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -