Wednesday, April 24, 2024
- Advertisement -

స్టేజ్‌పైన ఎమోష‌న‌ల్ అయిన ఎన్టీఆర్‌

- Advertisement -

ద‌మూరి క‌ల్యాణ్ రామ్‌కు హిట్ వ‌చ్చి చాలా కాల‌మే అయింది. ప‌టాస్ సినిమా త‌రువాత ఇప్ప‌టి వ‌రకు మ‌రో హిట్ లేదు. ఈ మ‌ధ్య‌లో చాలానే సినిమాలు చేసిన‌ప్ప‌టికి అవి ఫెయిల్ అయ్యాయి. ఎమ్మెల్యే సినిమా మాత్రం యావ‌రేజ్‌గా ఆడింది. క‌ల్యాణ్ రామ్ తాజాగా హీరోగా న‌టించిన సినిమా 118. నివేదా థామ‌స్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకు ప్రముఖ ఫోటోగ్రాఫ‌ర్ కేవీ గుహాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతో ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు బాల‌య్య‌, ఎన్టీఆర్‌లు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతు… గుహాన్‌గారు కెమెరామెన్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి నాకు బాగా తెలుసు. నేను న‌టించిన బాద్ షా సినిమాకు ఆయ‌నే కెమెరామెన్‌.

ఆ సినిమాలో న‌న్ను చాలా బాగా అందంగా చూపించార‌ని , కష్టపడి పని చేసే మనిషి. 118 చిత్రాన్ని మరింత శ్రద్ధతో తీశారు. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమాను నేను చూడటం జ‌రిగింద‌ని తెలిపారు ఎన్టీఆర్‌.ఒక సీన్‌లో నివేదా థామస్ పెర్ఫార్మన్స్‌కి నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అదేవిధాంగా షాలిని పాండే కూడా సినిమాలో బాగా న‌టించిందని తెలిపాడు. కొత్తగా కథ చెప్పాలని అన్నయ్యకి చాలా క్యూరియాసిటీ.ఈ సినిమా ఆయన కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ఇక త‌న అన్న‌య్య క‌ల్యాన్ రామ్‌కు ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను ఇస్తుందని ఆయ‌న ఆశ‌భావం వ్య‌క్తం చేశారు. సినిమాను మార్చి 1న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లుగా ఎన్టీఆర్ ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -