సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నటుడు హరికృష్ణ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు.హైదరాబాద్ నుంచి పెళ్లి కోసం నెల్లురు వెళ్తున్న సమయంలోనే దుర్ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.హరికృష్ణ మరణ వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు షాక్ గురైయ్యారు.ప్రమాద సమయంలో కారులో హరికృష్ణతో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తుంది.
తండ్రి హరికృష్ణ మరణవార్త విన్న ఎన్టీఆర్ అక్కడిక్కడే కుప్పకులిపోయాడు. భర్త మరణించాడని తెలుసుకున్న ఎన్టీఆర్ అమ్మగారు కూడా షాక్ గురై,స్పృహా కొల్పోయారట.ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు.అటు తండ్రి మరణవార్తతో బాధపడుతున్న ఎన్టీఆర్కు,ఇటు తల్లి ఆరోగ్యం బాలేదని తెలిసి కొడుకు ఎన్టీఆర్ తీవ్ర మనోవేదనుకు చెందుతున్నారు.2014లో ఎన్టీఆర్ పెద్దన్నయ్య జానకిరామ్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?v=HEOCbJK50i8