అవును మీరు చదివింది నిజమే. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒక్కడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హీరోయిన్ నిత్యా మీనన్ తిట్టింది. అది కూడా అందరి ముంది. నిత్యా తిట్టిన ఎన్టీఆర్ చిరునవ్వు ఇస్తూ అలాగే ఉండిపోయాడు. అయితే.. ఇదంతా జరిగింది రియల్ లైఫ్లో కాదులెండి.. రీల్ లైఫ్లో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న జనతా గ్యారేజ్ ఆడియో ఇటివలే జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుక సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. అయితే ఈ ట్రైలర్ లో ఓ షాట్ వద్ద ఎన్టీఆర్ వైపు నిత్యా చెయ్యి చూపిస్తూ.. “ఇంత బోరింగ్ క్యాండిడేట్ తో ఎలా అండి?” అంటూ సమంతకి చెబుతుంది. అప్పుడు ఎన్టీఆర్ చిరునవ్వు నవ్వుతూ నిత్యా వైపు అలాగే చూస్తుంటాడు. ఇక్కడ బోరింగ్ అనడం కూడా తిట్టడమే కాబట్టి.. ఎన్టీఆర్ ను నిత్యా తిట్టిందంటు కథనాలు రాసుకుంటున్నారు.
అయితే ఇది కూడా ఓ రంకంగా ప్రమోషన్ అని కూడా చెప్పుకోవచ్చు. విడుదలకు ముందు చిత్ర యూనిట్నే కాదు.. ఫ్యాన్స్ కుడా రకరకలుగా తమ అభిమాన హీరో చిత్రం ను ప్రమోట్ చేస్తుంటారు. అందులో భాగంగానే నిత్యా ఎన్టీఆర్ ను తిట్టింది అనే క్యాప్షన్ తో గ్యారేజ్ ని ఫ్యాన్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఎన్టీఆర్, కాజల్ మీద నేను పక్కా లోకల్ అనే ఐటమ్ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
{youtube}v=7O4Hm070Bc8{/youtube}
Related