Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మోహన్‌లాల్‌ సారీ చెప్పాడు! ఎందుకో తెలుసా?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. ఈ సినిమా ఆడియో శుక్రవారం జరిగింది. అయితే ఈ వేడుకకు మోహన్ లాల్ హాజరుకాలేదు. ఈ సినిమాలో మోహన్ లాల్ చాలా కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన కోసం ఎదురుచూసే ఎన్టీఆర్ అభిమానులకు ఆయన సారీ చెప్తూ ఓ వీడియో బైట్ ని పంపారు.

ఆ వీడియోలో ఏముందంటే.. ‘ఫంక్షన్‌కు రావడానికి వీలైనంత వరకు ట్రై చేశాను. కానీ బిజీ షెడ్యూళ్ల వల్ల కుదరలేదు. ఎన్టీయార్‌ అభిమానులందరికీ సారీ. కేరళలో జరిగే ఓనం పండగ సందర్భంగా మా జనతాగ్యారేజ్‌ విడుదలవడం ఆనందంగా ఉంది. ఎన్టీయార్‌ ఈజ్‌ మై లవబుల్‌ బ్రదర్‌’ అని ఆ వీడియోలో చెప్పారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రకృతిని ప్రేమించే యువకుడిగా ఎన్టీఆర్‌, మనుషులంటే ఇష్టపడే వ్యక్తిగా మోహన్‌లాల్‌ కనిపిస్తున్నారు. జనతాగ్యారేజ్‌కి వీరిద్దరికీ ఏం సంబంధం? ఇద్దరూ కలిసి ఏం చేశారు? అంటూ సాగే ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

{youtube}v=7O4Hm070Bc8{/youtube}

Related

  1. ‘జనతా గ్యారేజ్’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది!
  2. జనతా గ్యారేజ్ ఆడియో విషయంలో ఫ్యాన్స్ కి అన్యాయం!
  3. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!
  4. జనతా గ్యారేజ్ సినిమాలోకాజల్ ఐటెం సాంగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -