Thursday, May 2, 2024
- Advertisement -

ఒకే ఒక్కడు కి సీక్వెల్ రాబోతోంది !

- Advertisement -

‘ ఒకే ఒక్కడు ‘ ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అర్జున్ హీరోగా , మనీషా కోయిరాలా హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా శంకర్ దర్సకత్వంలో వచ్చింది. తమిళం లో మొదలవన్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా రెండు భాషల్లో బ్లాక్ బస్టర్ అవ్వడమే కాక హిందీ లో కూడా భారీ హిట్ అయ్యింది.

అక్కడ అనీల్ కపూర్ – రాణీ ముఖర్జీ జంటగా నాయక్ అని విడుదల చేసారు. అక్కడ కూడా మంచి రెవెన్యూ కలక్ట్ చేసిన ఈ సినిమా కి సీక్వెల్ వస్తే ఎలా ఉంటుంది ? సరిగ్గా ఈ విషయం మీదనే చర్చ నడుస్తోంది.  

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి, దీపక్ ముకుత్ ఈ సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం విశేషం. ఈ సీక్వెల్ కి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -