టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో వివాదానికి తెర లెప్పింది.మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్.. అతను చెప్పాడు ప్రజారాజ్యం అప్పుడు అవకతవకలు బాబోయ్.. ఆ సంగతి తెలిస్తే ప్రతి ఒక్కరు వామ్మో అంటారు.
టైం వచ్చినపుడు రివీల్ చేస్తా..’ అని శ్రీరెడ్డి అందులో పెర్కొన్నారు. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి,తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనని లైంగికంగా వాడుకున్నాడని దగ్గబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్పై సంచలన ఆరోపణలు చేసింది.
వీరిద్దరు క్లోజ్గా ఉన్న కొన్ని ఫోటోలు మీడియాకు విడుదల చేసింది.కాస్టింగ్ కౌచ్ పోరాటం తీవ్ర స్థాయి ఉన్న స్థితిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, వాళ్ల అమ్మగారిపై అనుచిత వాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైంది.దీంతో మీడియా కూడా శ్రీరెడ్డిని పట్టించుకోవడం మానేసింది.దీంతో సోషల్ మీడియాలో వివాస్పద పోస్ట్లు పెడుతు కాలం గడుపుతుంది.