మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి. అప్పట్లో ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాసింది అనే చేప్పాలి.ఇప్పుడు ఆ సినిమా గురుంచి చర్చ ఏందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రిమేక్ వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా రిమేక్ రాంచరణ్ చేస్తున్నాడు అని లేదు..లేదు ఈ సినిమా రిమేక్లో అల్లు అర్జున్ అయితే బాగుంటాడు అని కొందరు అభిప్రాయం కాగా లేటేస్ట్గా ఈ సినిమా రిమేక్లోకి సాయిధరమ్ తేజ్ వచ్చి చేరాడానే వార్త వైరల్ అయింది.
విజయబాపినీడు దర్శకత్వంలో 1991లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా, మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో మెగా ఫ్యామిలీ ఉందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.మెగా ఫ్యామిలీ హీరోలుగా మాస్ ఇమేజ్ వున్న చరణ్ .. అల్లు అర్జున్ .. సాయిధరమ్ తేజ్ లకు మాత్రమే ఈ సీక్వెల్ చేసే ఛాన్స్ వుందనేది ఈ వార్తల సారాంశం.ఈ మధ్య ఈ సీక్వెల్ గురించిన ప్రస్తావన అల్లు అర్జున్ దగ్గర వస్తే, “అది చరణ్ చేయవలసిన సినిమా” అని ఓపెన్ గా చెప్పేశాడు.
ఆ తరువాత ఈ సినిమా సీక్వెల్ ను సాయిధరమ్ తేజ్ తో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ‘జవాన్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా సాయిధరమ్ తేజ్… ఫేస్ బుక్ లైవ్ చాట్ లో అభిమానులతో ముచ్చటించాడు. ” ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్లో చేస్తారా?” అనే ప్రశ్న ఓ అభిమాని నుంచి ఎదురైంది.” ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ చేస్తే చరణ్ చేయాలి .. ఆయన చేస్తేనే బాగుంటుంది” అనే అభిప్రాయాన్ని తేజు సూటిగా వ్యక్తం చేశాడు. దాంతో ఈ సినిమా తేజు చేస్తాడంటూ జరుగుతోన్న ప్రచారానికి తెర పడింది.