Friday, April 26, 2024
- Advertisement -

అయ్యో.. ఆ రెండు సినిమాలకు ఒకే రోజు ప్ర‌మాదం!

- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ న‌టిస్తున్న రెండు సినిమాలు ఒకే రోజు ప్ర‌మాదానికి గురయ్యాయి. అయితే ప్ర‌భాస్ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ బిజీగా ఉంటున్న‌సంగ‌తి తెలిసిందే.. ఈ ప్రాజెక్ట్ ల‌లో ఆది పురుష్, స‌లార్ సినిమాలు చ‌క‌చ‌క షూటింగ్ జ‌రుపుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్ర‌మాదానికి గురి కావ‌డం కొంత క‌ల‌వ‌ర పెడుతోంది.

ముందుగా ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అది జ‌రిగిన కొన్ని గంటల్లోనే సలార్ సినిమా యూనిట్ రోడ్డు ప్రమాదానికి గుర‌య్యింది. ఈ రోడ్డు ప్ర‌మాదం పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సలార్ మూవీ యూనిట్ సిబ్బంది గాయప‌డ్డార‌ని తెలుస్తోంది. ఇది గోదావరిఖని-శ్రీనగర్ జాతీయ రహదారిపై జ‌రిగింది.

ఈ రోడ్డు మీద ఒక‌ యూటర్న్ వద్ద సలార్ యూనిట్ ప్ర‌యాణం చేస్తున్న‌ వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. దీంతో గాయ‌ప‌డిన ప‌లువురిని ద‌గ్గ‌ర్లోని ఆస్పత్రికి తరలించారు. బొగ్గు గ‌నుల్లో జ‌ర‌పాల్సిన కొన్ని స‌నివేశాల‌ను తీసేందుకు వెళ్తుంటే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఇక ముంబైలోని షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ ఆదిపురుష్ సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్క‌డ‌ గ్రీన్ స్క్రీన్ క్రోమా సెటప్ పూర్తిగా కాలిపోయింది. అక్క‌డ ఎవ‌రికీ ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. ఈ రెండు ప్రమాద సమయంలో హీరో, హీరోయిన్లు అక్కడ లేరు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

సుమంత్ అశ్విన్‌ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -