లాక్డౌన్లో వరుసగా పెళ్లి పీటలు ఎక్కారు టాలీవుడ్ సెలబ్రిటీలు. నిఖిల్- పల్లవి, రానా- మిహిక, కాజల్- గౌతమ్ కిచ్లూ వంటి స్టార్ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి. ఇక మోగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి కూడా డిసెంబరులో జరిగిన సంగతి తెలిసిందే. దీంతో మెగా కాంపౌండ్లో సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ల వివాహం కూడా త్వరలోనే అంటూ గాసిప్ రాయుళ్లు కథనాలు అల్లినా, దానికింకా టైం ఉందని వారు కొట్టిపారేశారు.
ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాగా శర్వానంద్, రామ్చరణ్ సతీమణి ఉపాసన వాళ్ల కజిన్ను పెళ్లి చేసుకోనున్నాడంటూ టీ- టౌన్ టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో యువ హీరోకు సంబంధించిన ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ ప్రొడ్యూసర్, దర్శకుడు ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్, దీపిక అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడట. ఈ నెలలోనే హైదరాబాద్లోనే పెళ్లి చేసేందుకు కూడా ఏర్పాట్లు కూడా మొదలయ్యాయట. కాగా సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ, కేరింత, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తతం ఇదే మా కథ సినిమాతో బిజీగా ఉన్నాడు.
పవర్ స్టార్ మూవీకి అంత డిమాండ్ చేసిందా?
చిరంజీవి ‘ఆచార్య’పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్