పద్మావతి కాస్త పద్మావత్ అయ్యింది
ఒక సినిమా విడుదల చేయాలంటే ఎన్ని కష్టాలో.. ఎన్ని వివాదాలో ‘పద్మావతి’ సినిమాను చూస్తే తెలుస్తుంది. సినిమా చిత్రీకరణ మొదలుకొని అన్నింటా వివాదాలు, దాడులు, రచ్చరచ్చ ఎన్నో జరిగాయి. చివరికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని ఆ సినిమాపై కక్ష గట్టాయి. చివరికి సినిమా విడుదలను అడ్డుకున్నాయి. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘పద్మావతి’. ఈ సినిమాలో దీపిక పదుకునె, రణవీర్ సంగ్, షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయాలని అన్నీ సిద్ధం చేసుకోగా అందరూ కలిసి సినిమాను అడ్డుకున్నారు.
ఆ తర్వాత అనేక వివాదాలు, మలుపులతో చివరికి సినిమా పేరు మార్చుకుంటేనే విడుదల చేస్తామని సెన్సార్ బోర్డు సూచించింది. చివరకు పద్మావతిని కాస్త ‘పద్మావత్’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమా జనవరి 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సెన్సార్ విభాగం యు/ఎ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఇది చారిత్రక సంబంధం లేని కల్పిత కథగా ప్రకటించాలని… సినిమా పేరును పద్మావతి బదులు పద్మావత్గా మార్చాలని, సినిమాలోని ఘుమర్ పాటలో మార్పు చేయాలనే సెన్సార్ బోర్డు సూచనలకు దర్శకుడు, నిర్మాతలు అంగీకరించారు. దీంతో సినిమా విడుదలకు పచ్చజెండా ఊపారు.
సినిమా విడుదల కాకపోవడంతో నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పుడు జనవరి 25వ తేదీన విడుదల చేస్తే విడుదలయ్యి ఆడకపోతే మాత్రం నిర్మాతలకు దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంది.