టీజర్తోనే అందరి దృష్టి ఆకర్షించిన సినిమా పేపర్ బాయ్.సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా దర్శకుడు జయశంకర్ వహించిన ఈ సినిమాను దర్శకుడు కథను అందించడంతో పాటు ఆయనే స్వయంగా నిర్మిస్తున్నారు.తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు.ట్రైలర్ లో వినిపించిన ప్రతి డైలాగ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయిపోతుంది. ‘ధరణి.. నేను చదివిని మొట్ట మొదటి కవిత.. ఈ మూడు అక్షరాలూ నాకు పరిచయమైంది పుస్తకాల్లో.. దగ్గరైంది అక్షరాల్లో..’ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇలా ట్రైలర్ లో వినిపించిన మాటలు యూత్ కి కనెక్ట్ అయిపోతాయి.
ఓ పేపర్ బాయ్.. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకుంటే ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్లోనే తమ సినిమా కథ ఏంటే చేప్పేశాడు దర్శకుడు.ఇక యూత్ కావల్సిన గ్లామర్ కూడా సినిమాలో ఉంది.హీరో,హీరోయిన్ల మధ్య లీప్ లాక్ సీన్లు ఉన్నాయి.సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉండటంతో బిజినేస్ కూడా బాగానే జరుగుతుందని సమాచారం.ఇక సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.