Monday, April 29, 2024
- Advertisement -

బర్త్ డే స్పెషల్..గాంజా శంకర్‌గా తేజ్

- Advertisement -

యాక్సిడెంట్ నుండి రికవరీ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకోస్తున్నారు. రీసెంట్‌గా పవన్‌తో బ్రో సినిమాలో మెప్పించిన తేజ్‌…తాజాగా గాంజా శంకర్‌గా రానున్నారు. ఇవాళ తేజ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేయగా ఇది ఆయన కెరీర్‌లో 17వ సినిమా.

రామ్ చరణ్‌తో రచ్చ సినిమా తెరకెక్కించిన సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

ఇక బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. చిన్నప్పుడే స్కూల్‌ ఎగ్గొట్టేసి.. అమ్మానాన్నల మాటను పెడచెవిన పెట్టి పెద్దదైన గాంజా శంకర్‌గా తేజ్‌ని చూపించారు. ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ ఊరమాస్‌ను చూడబోతున్నాం అని క్లారిటీ ఇచ్చేసింది. భీమ్స్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -