Sunday, May 5, 2024
- Advertisement -

పవన్ సినిమాలో తమ్ముడే విలన్ అయ్యాడు..?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా ఎస్ జే సూర్య సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎస్ జే సూర్య తో ఖుషీ, పులి చిత్రాలు తీసాడు పవన్. ఖుషీ మంచి హిట్ గా నిలిస్తే.. పులి మాత్రం పెద్ద ప్లాప్ గా నిలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేయబోతున్నారు పవన్-సూర్య.

ఈ చిత్రాన్నికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ చిత్రంలో విలన్ ఎవరు అనే విషయంలో ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ బడా ప్రాజెక్టులో మెయిన్ విలన్ గా అజయ్ నటించనున్నాడని తాజా సమాచారం.

ఈ యంగ్ విలన్ గతంలో పవన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి తమ్ముడుగా నటించాడు. ప్రస్తుతం అజయ్ ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ కనిపిస్తున్నాడు. పవన్ సినిమాతో మళ్లీ మెయిన్ విలన్ గా ఛాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రంలో హీరోకి సరిసమానమైన పాత్రలో అజయ్ కనిపిస్తాడని.. దర్శకుడు ఆ పాత్రను చాలా సరికొత్తగా డిజైన్ చేశాడని అంటున్నారు. మరి పవన్-అజయ్ కాంబినేషన్ లో మరో హీట్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -