- Advertisement -
పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అతి పెద్ద ప్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ సినిమాను బుల్లితెర మీద ప్రదర్శించారు.అందువలన జెమినీ టీవీ వారు 19.5 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఈ దీపావళి కానుకగా ఈ సినిమాను మొదటిసారి ప్రసారం చేశారు. ఈ సినిమా భారీ రేటింగ్ తీసుకొస్తుందని భావించారు. కానీ ఈ సినిమాకి 5.3 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది.
ఇలా జరగడం ఆ ఛానల్ వారికి పూర్తి నిరాశను కలిగించినట్టుగా తెలుస్తోంది. సినిమా కొన్న రేటుకి వచ్చిన రేటింగ్స్కి ఎక్కడ పొంతన లేదు.పవన్ కల్యాణ్,త్రివిక్రమ్లను నమ్ముకుంటే సినిమా నష్టాలను మిగిల్చిందని జెమినీ టీవీ వాపోతున్నారు.