Sunday, May 5, 2024
- Advertisement -

తెలంగాణ సీఎంకు ‘అజ్ఞాతవాసి’ స్పెష‌ల్ షో

- Advertisement -

ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర‌ ఉద్య‌మ స‌మ‌యంలో ఉప్పునిప్పుగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌ల‌వ‌డం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు ప‌వ‌న్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా ప్ర‌త్యేక షో వేస్తారంట‌. ఈ సినిమా చూడ‌డానికి ప్ర‌త్యేకంగా తెలంగాణ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించారు.

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ శనివారం (జనవరి-6) తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ రామ్మోహన్‌రావును తెలంగాణ స‌చివాల‌యంలో కలిశారు. ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సంద‌ర్భంగా ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుద‌ల‌వుతోంది. మంత్రి కోసం ‘అజ్ఞాతవాసి’ స్పెషల్ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఈ స్పెషల్ షోకు సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించారని తెలిసింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై అజ్ఞాతవాసి తీస్తున్న సినిమాలో కీర్తి సురేశ్‌, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -