Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్.. మళ్లీ డైరెక్టర్ ను మార్చాడు!

- Advertisement -

చూస్తుంటే.. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తర్వాత కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీరు మారనట్టే కనిపిస్తోంది. ఎందుకని ఆరా తీస్తే.. ఓ విషయం బయటపడింది. ఖుషీ లాంటి కెరీర్ టర్నింగ్ సినిమాతో పాటు.. కొమరం పులి లాంటి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ఎస్ జే సూర్యతో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలైంది.

కడప కింగ్.. అన్న టైటిల్ కూడా.. ప్రచారంలోకి వచ్చింది. కథ ఫ్యాక్షన్ బేస్డ్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని కూడా లీకులొచ్చాయి. అయితే.. ఆ సినిమాకు సంబంధించి ఇంకో కొత్త విషయమే.. ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.

దర్శకుడు ఎస్ జే సూర్యకు ఈ మధ్య నటుడిగా కూడా అవకాశాలు వస్తున్నాయి. మురుగదాస్ తో మహేష్ బాబు కొత్త సినిమాలో ఎస్ జే కు విలన్ కేరెక్టర్ దక్కిందన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో.. యాక్టింగ్ పై ఫోకస్ పెంచుతున్న ఎస్ జే సూర్యను.. తన కొత్త సినిమా నుంచి తప్పించాలని పవన్ నిర్ణయించుకున్నట్టు ఇండస్ట్రీ కోడై కూస్తోంది. అందుకే.. డైరెక్టర్ డాలికి.. ఈ ప్రాజెక్టు అప్పగించినట్టు తెలుస్తోంది

అన్నట్టు.. బంగారం సినిమా షూటింగ్ సమయంలో తనకు వచ్చిన ఆలోచననే.. ఈ సినిమా కథగా పవన్ కళ్యాణ్ మలిచినట్టుగా కూడా మరో ప్రచారం ఉంది. చూస్తుంటే.. సేమ్ టు సేమ్.. సర్దార్ గబ్బర్ సింగ్ కు జరిగిన పరిణామాలే.. ఈ సినిమాకూ రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో.. చూడాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -