Friday, April 26, 2024
- Advertisement -

సూర్య గొప్ప మనసు.. ఫ్యాన్స్​కు ఆర్థిక సాయం..!

- Advertisement -

కరోనా అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కరోనాతో బాధపడుతున్న వారే. ప్రముఖ నటుడు సోనూ సూద్​ .. పేద ప్రజలకు తనకు తోచినంత సాయం చేసి .. రియల్ హీరోగా నిలిచాడు. కోలీవుడ్ లో తమిళ హీరో సూర్య కూడా తన ఫ్యాన్స్​కు ఆర్థిక సాయం చేస్తున్నాడు. తన అభిమాన సంఘంలో ఉన్న 250 మంది కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సూర్య దృష్టికి వచ్చింది. దీంతో వారికి ఒక్కోక్కరికి రూ. 5000 చొప్పున మొత్తం రూ.12.5 లక్షలను ఆర్థిక సాయంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేశారు.

ఇప్పుడే కాదు మొదటి నుంచి సూర్య ఆయన తమ్ముడు కార్తీ ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అగరం అనే ఫౌండేషన్ ను స్థాపించి అనాథలకు, నిరాశ్రయులకు విద్యను అందిస్తున్నారు. ఆ ఫౌండేషన్ పేరిట తమ తండ్రి శివ కుమార్ తో కలిసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి సూర్య బ్రదర్స్ ముందుకు వచ్చారు. కొద్దిరోజుల కిందట సీఎం స్టాలిన్ ను కలిసి కరోనా నివారణ నిధికి కోటి రూపాయల సహాయం అందజేశారు.

Also Read: సోనూసూద్​ .. మరో సంచలన నిర్ణయం

ఇటీవల సూర్య నటించిన ఆకాశమే హద్దురా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సూర్య పాండిరాజ్, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వెట్రిమారాన్ దర్శకత్వంలో వాడి వాసల్ సినిమా కూడా చేయనున్నాడు. కరోనా లాక్ డౌన్ ముగియగానే ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

Also Read: త్వరలో చిరంజీవి అంబులెన్స్​లు? నిజమెంత..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -