ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మళ్ళీ కరోనా ప్రభావం క్రమక్రంగా పెరుగుతూ వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సినీ నటులకు బాగా ఎఫెక్ట్ చూపిప్తుంది. దాంతో గతంలో కరోనా భారిన పడ్డవారు మరోసారి టెస్టులు చేయించుకోవడం.. టీకా వేయించుకోవడం జరుగుతుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నటులు చాలా మేర కోవిడ్ పాజిటివ్ అయ్యారు. టాలీవుడ్ లో కూడా కరోనా భాదితుల సంఖ్య పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మళ్ళీ తన కరోనా టెస్ట్ చేయించుకున్నట్టుగా తెలిపింది. ఇదిలా ఉంటే గత ఏడాది కరోనా పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో టెస్ట్ అంటే విపరీతంగా భయపడిపోయిన పాయల్ ఈసారి మాత్రం బాగా ధైర్యం చేసుకొని టెస్ట్ చేయించుకుందట. షూటింగ్స్ నిమిత్తం టెస్ట్ చేయించుకున్నానని తెలిపి తన కరోనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలిపింది.
వకీల్ సాబ్ దెబ్బకీ థియేటర్ కుర్చీలు, తలుపులు ధ్వంసం!