కొన్ని రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కదలికలు మొదలయ్యాయి. కాల్పుల మోతలు మోగుతున్నాయి. శుక్రవారం జమ్ముకాశ్మీర్ లో రెండు వేరు వేరు చోట్ల భారీ ఎన్ కౌంటర్ లు చోటుచేసుకున్నాయి. భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎత్తున్న కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
పోలీసులు తాజాగా మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ముకాశ్మీర్ లోని అవంతిపొరరా జిల్లా త్రాల్లోని నౌబాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. స్థానికి పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఘటనాస్థలి నుంచి తుపాకులు, మండుగుండు సామగ్రి లభ్యమైంది. అలాగే, షోఫియాన్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో మసీదులో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆయా ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.
వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్
పవన్ ‘వకీల్ సాబ్’ గురించి… ఆలియా భట్ ఏమందో తెలుసా?
లక్కిఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ !