Wednesday, May 15, 2024
- Advertisement -

మోడీ.. ప్రభాస్, మహేష్ కి ఏం లేఖ రాశారు..?

- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. పరిసరాల శుభ్రత కోసం స్టార్ట్ చేసిన స్వచ్ఛభారత్ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ ప్రోగ్రాంని జనాల్లోకి మరింతగా తీసుకెళ్ళేందుకు సినీ రంగంలోని క్రీడారంగంలోని తారలకు ప్రధాని లేఖలు రాశారు.

తాము పాల్గొంటూ ప్రజలు కూడా ఈ మంచి కార్యక్రమంలో మరింత ఆసక్తి తో పాల్గొనేలా చేసేందుకు పాటుపడాలని ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని లేఖలో ఈ సెలబ్రెటీలను కోరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించినంతవరకు.. ఈ లేఖను అందుకున్నవారిలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ప్రధానికి బాగా పరిచయస్తులైన మోహన్ బాబు ఉన్నారు. హిందీ, తమిళ, మలయాళ చిత్ర రంగాల్లోని అగ్ర దారులకు కూడా ఈ లేఖలు అందాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని లేఖలు అందుకున్న తారలతో ఓ స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం.

మహేష్ బాబు, ప్రభాస్ దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్నవారు. ఇక రాజమౌళి ఎవరనేది దేశం నలుమూలల ఎవరినీ అడగాల్సిన పనిలేదు. అండుకే వీరిని స్పేషల్ గా ఈ కార్యక్రమంకు కోసం ఎందుకున్నారు ప్రధాని. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ – టీడీపీ కూటమికి మద్దతునిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ లేఖను అందుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -