Saturday, May 4, 2024
- Advertisement -

వివాదంలో కత్తి మహేష్.. పోలీసు కేసు నమోదు..!

- Advertisement -

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు కత్తి మహేష్. తాజాగా కత్తి మరో వివాదంలో చిక్కుకున్నారు. శ్రీరాముడిపై ఆయన అనుచిత వ్యాఖ్యాలు చేశారని.. హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందగా.. ఐసీసీ సెక్షన్ 502 కింద కేసు నమోదు చేశారు.

అయితే ఇటివలే కత్తి మహేష్ మాట్లాడుతూ.. శ్రీరాముని ఫేవరెట్ వంటకం జింక మాంసమని, సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది వండుకుని తినడానికేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు ఉండేవారని కూడా అన్నారు. దాంతో కత్తి మహేష్ వ్యాఖ్యలపై దూమారం రేగింది. పలువురు నెటిజన్లు కత్తి మహేష్ పై విమర్శలు చేశారు. అయినప్పటికి మహేశ్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

తాను భయంకరమైన హిందువునని, దేన్నీ గుడ్డిగా ఫాలో కాబోనని, వాల్మీకి రామాయణ అనువాదంలోని ఉత్తర కాండలో ఉన్న 42 సర్గ, 18 నుంచి 22 వరకూ వచనాలు, యుద్ధకాండంలోని వచనాలు చూడాలని సమాధానం ఇచ్చారు. కాగా, 2018లోనూ రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆరు నెలల పాటు హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తున్నట్టు అప్పటి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -