ప్రముఖ ఒరియా నటి సిమ్రన్ సింగ్ మృతి చెందారు. ఆమె శవం మహానది ఒడ్డున దొరికింది. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నాయాని తెలుస్తుంది. తల, ముఖంపై గాయాలు ఉండంటంతో సిమ్రన్ సింగ్ది హత్యా లేక ఆత్మహత్య అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిమ్రన్ సింగ్ను ఆమె భర్తే చంపేసాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేశారు.సిమ్రన్ గతంలో సంబలపురి ఆల్బమ్స్ సెల్ఫీ బెబో, రిక్షా వాలా, రిమ్ జిమ్, మోర్ గర్ల్ ఫ్ర్డెండ్ 2, దిల్ క రాజా, డిజే బాబు రిటర్న్ వంటి వాటిల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ఆమె మరణించడానికి కొన్ని గంటల ముందు ఓ వాయిస్ రికార్డు బయటికి వచ్చింది.
ఈ వాయిస్ రికార్డులో తాను మానసికంగా చాలా అలిసిపోయానని, త్వరలో ఈ ప్రపంచాన్ని వీడిపోతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ వాయిస్ రికార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తన భార్య మరణించిందని పోలీసులు చెప్పేవరకు తనకు తెలియదని అంటున్నాడు సిమ్రన్ సింగ్ భర్త.తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, దానికి రెండు వైపుల పెద్దలు ఇష్టపడలేదని వేరేగా ఉంటున్నామని అన్నారు. అయితే గత కొంతకాలంగా తమ మధ్య విభేధాలు వచ్చి వేరుగా ఉంటున్నామని తెలిపాడు.
- హనీమూన్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
- కేబినెట్ సమావేశానికి మళ్లీ పవన్ గైర్హాజరు
- మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..
- రంగనాథ్ను అరెస్ట్ చేయండి?
- విద్యార్థులకు మద్దతు.. సల్మాన్ ఖాన్ పై ట్రోల్స్..
