దిల్రాజు నిర్మాణంలో మూడోసారి
చేసే సినిమాలు తక్కువ అయినా పెద్ద పెద్ద హీరోలతో చేస్తుండడంతో పూజా హెగ్డే మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్తో సాక్ష్యం సినిమాలో నటిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో మహేశ్బాబు నటిస్తున్నాడు. ఈ సినిమాకు పూజ ఒప్పుకుంది. ఇప్పుడు తాజాగా ఈ భామ నితిన్తో జోడి కడుతోంది.
వాణిజ్య ప్రకటనల్లో మెరుస్తూ వచ్చిన ఈ భామ ముకుంద సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది. ఇటీవల డీజే సినిమాతో మరో విజయం అందుకుంది. ఆ సినిమాల్లో అందాలన్నీ ఆరబోసింది. దిల్రాజు నిర్మాణంతోలో దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో పూజా నటించిన సంగతి తెలిసిందే. ఇక మూడోసారి కూడా పూజ దిల్రాజుతో కలిసి పనిచేయనుంది. శతమానం భవతి సినిమాను తీసిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ సినిమాను తీస్తున్నాడు. నితిన్కు మంచి విజయం అందించేలా ఈ సినిమా ఉండనుంది. పూజ డేట్స్ కూడా ఫైనల్ అయిపోయాయని టాక్. ఈ సినిమాలో మరో హీరోయిన్కు కూడా అవకాశం ఉందట. మరీ ఆ పాత్రలో ఎవరు మెరుస్తారో చూడాలి. ప్రస్తుతం దర్శకుడు సతీశ్ వేగేశ్న స్క్రిప్ట్ పనులను మొత్తం ముగించుకున్నాడు. ఫైనల్గా దిల్ రాజు షూటింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 2018 చివరలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్.