Monday, April 29, 2024
- Advertisement -

కష్టాల్లో పూజా హెగ్డే…

- Advertisement -

అల్లు అర్జున్ DJ సినిమా తర్వాత పూజా హెగ్డే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. వరస ఆఫర్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి వంటి భారీ-బడ్జెట్ సినిమాలతో పాటు రంగస్థలంలో ప్రత్యేక పాటతో అగ్ర హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే మోగా భారీ ప్రాజెక్ట్ చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటించిన ఆచార్య లో రామ్ చరణ్ కు జోడిగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. అంతేకాదు పూజా హెగ్డే నటించిన కోలీవుడ్, బాలీవుడ్‌ సినిమాలు కూడా పెద్దగా రాణించలేదు.

బాలీవుడ్ లో పూజా హెగ్డే నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్, సర్కస్ సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అలాగే తెలుగులో ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. కోలీవుడ్‌లో చివరి ప్రాజెక్ట్ మృగం అంచనాలను అందుకోలేకపోయింది. మూడు పరిశ్రమల్లో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో పూజా హెగ్డే తన కెరీర్‌లో చాలా కష్టాలను ఎదుర్కొంటోంది.

Also Read : RX100 దర్శకుడితో నాగార్జున…

వరుస పరాజయాలతో చాలా ప్రాజెక్ట్‌లను కోల్పోతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో సంతకం చేసిన ప్రాజెక్ట్‌లు లేవు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా లో ప్రధాన కథానాయికగా ఎంపిక చేశారు, కానీ ఇప్పుడు ఆమెను సినిమా నుండి తొలగించి శ్రీ లీలని ప్రధాన కథానాయికగా ఎంచుకుంది చిత్ర బృందం. అయితే పూజా హెగ్డే చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ మరియు పయ్యా 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాల విజయం అమెకు చాలా అవసరం. ఒకవేళ ఈ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోతే, పూజా హెగ్డే కూడా స్టార్‌డమ్ నుండి బయట పడవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -