గత సంవత్సరం దసరా కు విడుదలైన అక్కినేని నాగార్జున ది ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత నాగార్జున తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఇంకా ధృవీకరించలేదు మరియు తన నెక్ట్స్ దర్శకుడిని ఎంచుకోవడానికి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయనని, తన తదుపరి సినిమా సెట్స్పైకి రావడానికి ఎక్కువ సమయం పుడుతుందని చెప్పారు. ఇప్పుడు తాజాగా నాగార్జున RX100 దర్శకుడు అజయ్ భూపతితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
వాస్తవానికి, నాగార్జున 2017లో సంచలన విజయం సాధించిన మలయాళం మూవీ రీమేక్ను ప్లాన్ చేసాడు. ఈ సినిమాకి రచయిత ప్రసన్న కుమార్ దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది, కానీ అనేక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఆయితే ఇప్పు నాగార్జున RX100 దర్శకుడు అజయ్ భూపతితో సినిమాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు అజయ్ భూపతి నటి పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ అయిన మంగళవరం అనే తన తాజా చిత్రం షూటింగ్ భాగాన్ని ఇటీవలే ముగించారు. పాయల్ RX100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.