Tuesday, May 21, 2024
- Advertisement -

మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన జిగేల్ రాణి

- Advertisement -

పూజ హెగ్డే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అయిన స‌రైన హిట్ లేద‌నే చెప్పాలి. ఒక లైలా కోసం,ముకుంద సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈమె చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఇక్క‌డ లాభం లేద‌నుకొని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ హృతిక్ రోషన్ తో మొహెంజో దారో నటించినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో ఏ చాన్స్ లేకుండా పోయింది.ఇదే సమయంలో అల్లు అర్జున్ సరసన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో చాన్స్ రావడం..అందులో బికినితో కుర్రకారుని రెచ్చగొట్టడంతో పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఈ సినిమా త‌రువాత వ‌రుస సినిమాలు చేస్తు బిజిగా ఉంది. మొన్న ఆ మ‌ధ్య వ‌చ్చిన రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసింది. పూజ హెగ్డే ప్ర‌స్తుతం మ‌హేష్ , ఎన్టీఆర్‌,ప్ర‌భాస్ సినిమాల‌లో హీరోయిన్‌గా చేస్తుంది.అయితే పూజ‌కు మ‌రో బాలీవుడ్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.హౌస్ ఫుల్ 4 చిత్రంలో పూజ మంచి కీ రోల్ కి ఎంపికయినట్లు తెలుస్తోంది.ఆమె హీరోయిన్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ రూపొందిస్తున్న సాక్ష్యం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -