Thursday, May 16, 2024
- Advertisement -

మహర్షి హీరోయిన్ కి రానా రికమండేషన్?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు, కానీ వచ్చినప్పుడు మాత్రం వాటిని మిస్ చేసుకుంటే అంతే సంగతులు. ఇప్పుడు పూజ హెగ్డే ఈ విషయం మీద మంచి క్లారిటీ తో ఉంది. అందుకే వచ్చిన అవకాశాలన్నీ అలా పట్టేసుకుంటుంది. భాషా బేధం లేకుండా, మంచి పారితోషికం ఇస్తే చాలు అన్నట్లు అన్ని సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే తాను నటించిన మహర్షి కూడా విజయం సాధించడం తో తన రేంజ్ కూడా పెరిగిపోయింది.

ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాకుండా ప్రభాస్ తదుపరి చిత్రం జాన్ లో కూడా అహీరోయిన్ పూజా నే. ఇక బాలీవుడ్ లో కూడా పూజ కి డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది. అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, రానా తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బంద లాంటి వారితో పూజా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.

అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే, నానా పటేకర్ ని తీసేసి ఈ సినిమా లో రానా ని పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు. అందుకు అనుగుణం గా కథ లో మార్పులు కూడా చేసుకున్నారట. అప్పుడు రానా పక్కన ఒక హీరోయిన్ కోసం చూడగా రానా పూజ ని రికమెండ్ చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా పూజా మంచి ఛాన్స్ కొట్టేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -