Sunday, April 28, 2024
- Advertisement -

సందీప్‌పై పూనమ్ సెటైర్!

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ వంగ. తర్వాత ఇదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడా పాగా వేశాడు. ఇక రీసెంట్‌గా రణబీర్ కపూర్‌తో యానిమల్ సినిమాను తెరకెక్కించి సెన్సేషన్ సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.900 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగాను ఉత్తమ దర్శకుడు పురస్కారంతో దాదాసాహెబ్ ఫాల్కే ఐఎఫ్ఎఫ్ నిర్వాహకులు సత్కరించారు. ఇక సందీప్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల తనదైన శైలీలో స్పందించింది హీరోయిన్ పూనమ్ కౌర్

మిసోజినీ (మహిళల పట్ల ద్వేషం వ్యక్తం చేసే వ్యక్తి)కి అవార్డుకు వచ్చిందని విన్నా. దీనిపై కేవలం ‘యానిమల్స్’ మాత్రమే నిర్ణయం తీసుకోగలవు అని చెప్పుకొచ్చారు. ఇది ప్రమాదానికి సంకేతం అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -