హీరోయిన్ పూనమ్ కౌర్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.పూనమ్ కౌర్ రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ఓటుకు నోటు గురించి ట్వీట్ చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే….. ‘ఆంధ్రా.. తెలంగాణ అంటూ మన వాళ్లే కొట్టుకుంటూ ఉండే లాభం ఎవరికబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావడం లేదు. వీళ్లను చూస్తుంటే పిల్లి-పిల్లి తగువును కోతి తీర్చిన కథ గుర్తుకు వస్తోంది’ అంటూ ట్వీట్ చేసింది.దీనిపై ఆనంద్ అనే ఓ నెటిజన్ స్పందించాడు.
నువ్వు చేసిన ఈ ట్వీట్ వల్ల టీడీపీ పార్టీకి తెలంగాణలో ఓటు కూడా రాదని ట్వీట్ చేశాడు.అయితే ఆనంద్ ఏపీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్ ఇక్కడ సమస్యగా మారింది. దీంతో ఆనంద్ చేసిన విమర్శపై పూనమ్ కౌర్ దీటుగా స్పందించింది.‘నువ్వు ఎవరి ఫొటో పెట్టుకున్నావో.. ఆ పెద్దమనిషి విలువ తీయకు.నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయ్’ అని క్లాస్ పీకింది.రాజకీయల గురించి ట్వీట్ చేసిన పూనమ్ను చాలమంది విమర్శిస్తున్నారు.