Saturday, May 4, 2024
- Advertisement -

సుహాసినిపై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పోసాని

- Advertisement -

దివంగత నటుడు,టీడీపీ ఎంపీ హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్ పల్లి నియోజక వర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.సుహాసిని తెలంగాణ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డంపై సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తనదైన రీతిలో స్పందించారు. 30 ఏళ్ల అనుబంధంలో హరికృష్ణ నాకు ఎన్నో విషయాలు చెప్పారని అన్నారు. మీ తండ్రి హరికృష్ణను చంద్రబాబు ఎన్ని సార్లు మోసం చేశారో మీ కుటుంబానికి తెలియదా అంటూ సుహాసినిని ప్రశ్నించారు. తండ్రిని అవమానించిన అవకాశవాది ఆదేశిస్తే కూటమి అభ్యర్ధిగా కూకట్ పల్లి నుండి ఎలా పోటీకి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. అమాయకురాలైన సుహాసినిని చంద్రబాబు రోడ్ మీదకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె గెలిచినా, ఓడినా అవమానమే.. చంద్రబాబు మాయలో పడి కమ్మ సెంటిమెంట్ తీసుకొస్తే తెలంగాణా వాళ్లు స్థానిక సెంటిమెంట్ తీసుకొస్తే ఇక్కడ ఆంధ్రావాళ్లు సంతోషంగా బతకగలరా.? ఓటు అనేది నిజాయితీగా వెయ్యాలి.. కమ్మ కోణంలో ఓటు వేయొద్దు.. ఇక్కడి ఆంధ్రావాళ్లంతా అన్నదమ్ముల్లా కలిసిపోయారు.కూకట్ పల్లిలో ఎక్కువగా కమ్మవాళ్లు ఉన్నారనే సుహాసిని చంద్రబాబు అభ్యర్ధిగా ప్రకటించారు తప్ప ప్రజలకు సేవ చేద్దామని కాదు. ఓటు వేసేప్పుడు కులాన్ని బట్టి కాదు గుణాన్ని బట్టి వేయాలి. సుహాసిని ఎంతమందికి తెలుసున‌ని పోసాని సుహాసినిని ప్ర‌శ్నించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -