తెలుగు సినీ పరిశ్రమలో ప్రభాస్, అనుష్క శెట్టిల బంధం అందరికీ ఆసక్తికరం. వీరిద్దరూ కలిసి దాదాపు నాలుగైదు సినిమాల్లో నటించారు. బిల్లా, మిర్చి, బాహుబలి తదితర సినిమాల్లో నటించిన ఈ జోడి హిట్ కాంబినేషన్గా ముద్రపడింది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధం గురించి మీడియాకు చాలా ఆసక్తిగా మారింది. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై వారిద్దరూ స్పందించకుండా వారి పని వారు చేస్కుంటూ వెళ్తున్నారు.
అయితే ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ సినిమా కోసం ప్రభాస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నాడని సమాచారం. దర్శకుడు అశోక్ రూపొందించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన థియేటర్లలోకి రానుంది. బాహుబలి -2 సినిమా తరువాత అనుష్క నటిస్తున్న తొలి సినిమా కావడంతో ‘భాగమతి’పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ప్రభాస్ ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. రెండు విభిన్న పాత్రల్లో అనుష్క ఈ సినిమా నటించింది. ట్రైలర్ అలరించింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతోందని ఆశిద్దాం.