Tuesday, May 7, 2024
- Advertisement -

ప్ర‌భాస్‌, పూజాహెగ్డే సినిమా టైటిల్ మార్పు..

- Advertisement -

స్టార్ హీరోలలో అందరూ ఏడాదికో సినిమాను విడుదల చేస్తుంటే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం బాహుబలి రిలీజ్ చేసి ఏడాది అయిపోయినా మరో సినిమాను విడుదల చేయలేదు. మరో సినిమా వచ్చే సమయానికి దాదాపు రెండేళ్ల గ్యాప్ ఉంటుందని అర్థమైంది. మొన్నటివరకు సాహో సినిమాతో బిజీగా వున్న ప్రభాస్ ఇప్పుడు మరో లవ్ స్టోరీని స్టార్ట్ చేశాడు.

సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా షూటింగును కొంతవరకూ పూర్తి చేసిన ప్రభాస్, తన తదుపరి సినిమాపై దృష్టిపెట్టాడు. ఆయన నెక్స్ట్ మూవీ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగు ఇటలీలో మొదలైంది. తొలి షెడ్యూల్ షూటింగులో ప్రభాస్ .. పూజా హెగ్డే పాల్గొంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.

ఇకపోతే సినిమాకు ఆమూర్ అనే ప్రెంచ్ పదాన్ని టైటిల్ గా సెట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శకుడు మరో టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్. సినిమా తెలుగుతో పాటు హిందీ తమిళ్ లో కూడా తెరకెక్కుతుండడంతో అందరికి అర్థమయ్యేలా ఉండాలని జాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.ప్రభాస్ కొత్త లుక్ తో ఈ సినిమాలో కనిపించనుండటం, ఆయన అభిమానులను ఖుషీ చేసే విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -