Friday, May 10, 2024
- Advertisement -

ప్ర‌భాస్ ఎనౌన్స్ చేసేశాడుగా..!

- Advertisement -

బ‌హుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగిన సంగ‌తి తెలిసిందే.దీంతో అత‌ని త‌రువాత సినిమాల‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. ఇక మీద ప్ర‌భాస్ సినిమాలు ఇండియా మొత్తం విడుద‌ల కావ‌డం ఖాయం.ప్ర‌భాస్ ఆలోచ‌న‌లు కూడా ఆ విధాంగానే ఉన్నాయి.ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేయ‌నున్నారు.ఈ సినిమా త‌రువాత ప్ర‌భాస్ ఎవ‌రితో ప‌ని చేస్తాడు అనే అనుమానం అంద‌రిలోను ఉంది.

అంద‌రి అనుమానాల‌కు తెర దించుతు ప్ర‌భాస్ త‌న త‌రువాత సినిమా ఎవ‌రితో చేస్తున్నాడో ఎనౌన్స్ చేశాడు.”నా నెక్స్ట్ సినిమా త్రైలింగ్వల్ ఫిలిం లాంచ్ కాబోతుంది. ఈ విషయం చెప్పడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నా.. కె.కె.రాధాకృష్ణ దర్శకత్వంలో.. గోపి మూవీస్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పూజాహెగ్డేతో హీరోయిన్ గా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది” అంటూ వెల్లడించాడు. ఈ సినిమా థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -