Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యాన్స్ కు అరుదైన గౌరవం

- Advertisement -

ప్రభాస్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్. కె.కె. రాధా క్రిష్ట కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిష్టం రాజు సమర్పణలో వంశీ ప్రమోద్, ప్రసీద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈనెల 23 న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను ప్రత్యేకంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తన అభిమానులనే ప్రభాస్ ఆహ్వానించనున్నారు. ఐదు భాషల్లో ని సినిమా ట్రైలర్స్ ను ప్రభాస్ తన అభిమానుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రభాస్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా కోడిడ్ నింబంధనలు పాటించి వేడుకను విజయవంతం చేయాలని ప్రభాస్ అభిమానులను కోరాడు.

ఈసినిమాను నార్త్, సౌత్ ప్రేక్షకులను అలరిలంచేలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందించేందుకు వేర్వేరు భాషల్లో వేరువేరు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. ఇలా అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం ఇదే తొలిసారి. దీంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

బిగ్ బాస్ కంటెస్టెంట్ కు బంపర్ ఆఫర్

నాగచైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా..!

కొత్తగా ట్రై చేశారు.. ఇంప్లిమెంటేషన్‌ ఫెయిల్.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -