బాహుబలి తరువాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమా సాహో. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలుపెట్టి సంవత్సరన్నరకు పైగా అయింది. ఇప్పటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాను హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతుండంటంతోనే సినిమా ఆసల్యం అవుతుందని చెబుతోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమా నిర్మాతకు హీరో ప్రభాస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అనుకుని మొదలు పెట్టారు.
ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట. సినిమా పూర్తి అవ్వలంటే మరో 50 కోట్లు అవుతుందని సమాచారం. సినిమా బడ్జెట్ ఇలా పెంచుకుంటు పోవడంపై ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడట. సినిమాను తక్కు బడ్జెట్లోనే పూర్తి చేయలని నిర్మాతను హెచ్చరించాడట ప్రభాస్. ఇక ఈ సినిమాను గస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
- Advertisement -
సాహో నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -