Sunday, May 5, 2024
- Advertisement -

శివాని సినిమాని టేకోవర్ చేయనున్న ప్రశాంత్

- Advertisement -

బాలీవుడ్ లో ఘానా విజయం సాధించిన చిత్రం టూ స్టేట్స్. ఈ సినిమా లో అర్జున్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పుడెప్పుడో హిందీ లో విడుదల కాగా ప్రస్తుతం తెలుగు లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు లో వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా తో పరిచయం అవుతున్నాడు. అర్జున్ కపూర్, అలియా భట్ పాత్రలని తెలుగు లో అడివి శేష్, శివాని రాజశేఖర్ చేస్తున్నారు. తెలుగు లో శివాని రాజశేఖర్ కి ఇదే మొదటి సినిమా. అయితే దర్శకుడి హీరో కి కొన్ని రోజులు అభిప్రాయం భేదాలు రావడం తో సినిమా షూటింగ్ కొన్ని రోజులు జరుగలేదు. అయితే ఆ తర్వాత మళ్ళి మొదలైనా కానీ సినిమా షూట్ ఏ మాత్రం ముందుకు సాగలేదు.

రెండో సారి సినిమా షూట్ సరిగా జరుగకపోవడానికి కారణం దర్శకుడు నిర్మాత కి మధ్య విభేదాలు రావడం. దానితో దర్శకుడు మీడియా ని అప్రోచ్ అయ్యాడు. తాను లేకుండా సినిమా ని ఫినిష్ చేయాలని చూస్తే ఊరుకొనేది లేదు అని గట్టిగా చెప్పాడు. ఈ దెబ్బ తో వివాదం మరింత ముదిరింది. ఆది లోనే శివాని మొదటి సినిమా కి ఇలా అడ్డంకులు వస్తాయి అని ఎవరూ ఊహించి ఉండరు. ఇక పోతే ఆ తర్వాత ఈ సినిమా ని జీవిత పూర్తి చేస్తుంది అనే టాక్ వచ్చినా కానీ ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.

ఇపుడు తాజా గా వినిపిస్తున్న వార్తలు ఏంటి అంటే, అ! మరియు కల్కి సినిమాలు చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ఈ సినిమా పూర్తి చేయించాలి అని ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ దర్శకుడు ఇంతకు ముందు కూడా క్వీన్ సినిమా కి దర్శకుడు సగం షూట్ చేయకుండా వదిలేస్తే, వెళ్ళి ముగించుకొని వచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -