Monday, April 29, 2024
- Advertisement -

కే‌జి‌ఎఫ్ ను ఫాలో అవుతున్న సలార్ !

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ మరియ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే శర వేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రశాంత్ నీల్, ప్రభాస్ లకు మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీ నేషనల్ వైడ్ గా ఆకాశమంత అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కే‌జి‌ఎఫ్ సిరీస్ కు ఏమాత్రం తగ్గకుండా సలార్ మూవీని అంతకు మించి అనేలా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

సలార్ మూవీని కే‌జి‌ఎఫ్ మాదిరిగానే రెండు భాగాలుగా రూపొందించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. మొదట ఈ మూవీని సింగల్ పార్ట్ గా రిలీజ్ చేయాలని భావించినప్పటికి కథ పెద్దది కావడంతో హడావిడిగా ఒకే పార్ట్ లో కథ చెబితే అందులోని సోల్ పాయింట్ దెబ్బతినే అవకాశం ఉందని, దాంతో కథకు అనుగుణంగా మూవీని రెండు భాగాలుగా తీయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నడట. అయితే వైరల్ అవుతున్న వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఒకవేళ ” సలార్ ” రెండు భాగాలుగా రిలీజ్ అయితే బాహుబలి, కే‌జి‌ఎఫ్ వంటి సినిమాల మాదిరి సలార్ కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక సలార్ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలు ఒకవేళ నిజమైతే మూవీ డేట్ కూడా మారే అవకాశం ఉంది. మరి ఈ వార్తల్లో నిజనిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

” హిట్ 3 ” లో త్రిబుల్ బొనాంజా !

ఆచార్య తెచ్చిన తిప్పలు.. పాపం కొరటాల పరిస్థితి ?

మహేశ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -